
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ₹6,000 మూడు విడతలుగా అందిస్తోంది. అయితే చాలా మంది రైతులకు 21వ విడత (₹2,000) ఇంకా బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మీ ఖాతాలో డబ్బు రాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉండొచ్చు. వాటిని ఎలా చెక్ చేయాలి, ఎలా సరిచేయాలో ఇక్కడ వివరంగా చూద్దాం.
- e-KYC పూర్తి కాలేదా?
పీఎం కిసాన్ యోజనలో e-KYC తప్పనిసరి. ఇది పూర్తికాకపోతే డబ్బు రాదు. PM Kisan అధికారిక వెబ్సైట్కు వెళ్లండి, “e-KYC” సెక్షన్లోకి వెళ్లి Aadhaar OTP ద్వారా పూర్తిచేయండి, PM Kisan e-KYC పూర్తి చేసిన తర్వాతే ఇన్స్టాల్మెంట్ జమ అవుతుంది.
- Aadhaar–Bank Link లేకపోవడం
మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ నంబర్తో లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ బ్రాంచిలో చెక్ చేయండి, NPCI ఆధార్-సీడింగ్ స్టేటస్ను కూడా ధృవీకరించుకోండి.
- తప్పు బ్యాంక్ వివరాలు
IFSC కోడ్, ఖాతా నంబర్, పేరు అసలు ఆధార్లో ఉన్నట్లుగా ఉండాలి. ఎలాంటి చిన్న తప్పు ఉన్నా DBT ఫెయిల్ అవుతుంది.
- భూసర్వే (Land Records) సమస్యలు
రాష్ట్ర భూసర్వర్లో మీ పేరుతో భూమి రికార్డులు అప్డేట్ లేకపోతే ఇన్స్టాల్మెంట్ ఆగిపోవచ్చు.
- పీఎం కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
pmkisan.gov.in ఓపెన్ చేయండి, Beneficiary Status క్లిక్ చేయండి, Aadhaar లేదా Mobile ద్వారా వెరిఫై చేయండి, మీ విడత జమ అయిందా లేదా ఏ తప్పు ఉందో అక్కడే చూపిస్తుంది.
ఒకవేళ డబ్బు జమ కాకపోతే క్రిషి సలహా కేంద్రం లేదా పీఎం కిసాన్ హెల్ప్లైన్ కి మీ Aadhaar, land records, బ్యాంక్ వివరాలు వెంట తీసుకెళ్లి సంప్రదించండి
155261
011-24300606 / 011-23381092
21వ విడత జమ కాకపోవడానికి ప్రధాన కారణాలు e-KYC సమస్యలు, ఆధార్-బ్యాంక్ లింక్, తప్పు ఖాతా వివరాలు, లేదా రికార్డు అప్డేట్ కాకపోవడం. వీటిని సరిచేస్తే ₹2,000 మీ ఖాతాలోకి తప్పకుండా వస్తుంది.